లాక్‌డౌన్‌ కొనసాగించాల్సిందేనని ప్రధానితో చెప్పా...!: కేసీఆర్

లాక్‌డౌన్‌ కొనసాగించాల్సిందేనని ప్రధానితో చెప్పా...!



ప్రధానితో రోజుకు రెండుసార్లు మాట్లాడుతున్నా. 


పరిస్థితిని అధిగమించేందుకు  తీవ్రంగా చర్చించాం. 


ఇంతకముందు ఎన్నడూ ఇలాంటి సందర్భాల్లేవు. 


బయటకు రానివ్వడంలేదని ఎవరూ బాధపడొద్దు. 


మోదీ గారు అడిగితే లాక్‌డౌన్‌ను కొనసాగించాల్సిందేనని చెప్పాను. 


బతికిఉంటే బలుసాకు తినొచ్చు. 


ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించుకోవచ్చు. ప్రాణాల్ని తిరిగి తేలేం కదా. 


యుద్ధం మిగిల్చే విషాదం చాలా భయంకరంగా ఉంటుంది. 


అంతులేనిదిగా ఉంటుంది. 


ఆ విషాదాన్ని దేశం/ నాగరిక సమాజం భరించజాలదు’’  


    జూన్3 వ తేదీ వరకు కొనసాగించాలని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ సర్వే ప్రకారంగా కొనసాగించాలని సూచించారని తెలిపారు.*


*ఈ విపత్కర పరిస్థితులలో డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసీ వారికి రెండు చేతులెత్తి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు.*


*కుటుంబాలను వదిలి, ప్రాణాలను ఫణంగా పెట్టి చేస్తున్న వారి సేవకు ఏమి ఇచ్చినా కొదువే కనుక గిఫ్ట్ క్రింద 10% బోనస్ గా ఇస్తున్నాము.* 


రు 7,500 లు గిఫ్ట్ కింద GHM, HMD పనివారికి, రూ. 5000 లు మున్సిపాలిటీ సిబ్బందికి ఇస్తున్నాము.